77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు చేసిన అపూర్వ త్యాగాలు, సేవలు చిరస్మరణీయమైనవన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల అభివద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్ ఆఫ్ లివింగ్ వంటి పది ముఖ్య సూత్రాలను దష్టిలో ఉంచుకొని, రాబోయే ఐదు సంవత్సరాలలో 15 శాతం కంటే ఎక్కువ జీఎస్డీపీ వద్ది రేటుతో జిల్లాను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.
ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, గ్రామాలను వ్యర్థ రహితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్షా్యన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 42,575 ఫిర్యాదులు స్వీకరించగా 39,742 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయని, రెవిన్యూ క్లినిక్ అనే కొత్త ఒరవడిని తీసుకువచ్చి భూ సంబంధిత సమస్యలను ఎప్పటికప్పుడు వీలైనంత వేగంగా పరిష్కరించుటకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పని చేస్తున్నారన్నారు.
వ్యవసాయ శాఖ ద్వారా ‘అన్నదాత సుఖీభవ’, పిఎం కిసాన్ పథకాల క్రింద రైతులకు రూ.140.24 కోట్ల పెట్టుబడి సాయం అందించామని, రైతు సేవ కేంద్రాల ద్వారా 48,289 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయడం జరిగిందన్నారు. పశు సంవర్ధక శాఖ ద్వారా 1,044 మంది రైతులకు రూ.20.88 కోట్ల పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు మంజూరు చేశామని, మత్స్యశాఖ ద్వారా చేప పిల్లల విడుదలను 13.5 లక్షల నుంచి 16.68 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. జిల్లా లీడ్ బ్యాంకు ద్వారా జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలకు రూ.31,729 కోట్ల లక్షా్యనికి గాను, 31 డిసెంబర్ 2025 నాటికి రూ.25,604 కోట్ల రుణాలు (81%) మంజూరు చేయడం జరిగిందని చెప్పారు.
జలవనరుల శాఖ ద్వారా ఈ ఖరీఫ్ సీజన్లో 2.11 లక్షల ఎకరాల ఆయకట్టుకు 24 టీఎంసీల సాగునీరు విడుదల చేశామని, గుంటూరు చానెల్ పొడిగింపు పనులకు రూ.274.53 కోట్ల పరిపాలనామోదం లభించి భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. డా. ఎన్.టి.ఆర్. వైద్య సేవ పథకం ద్వారా 1.42 లక్షల మందికి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగిందన్నారు. డీసీహెచ్ఎస్ సెకండరీ హెల్త్ ద్వారా ఈ జిల్లా వైద్యశాలలో రూ.47 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ బ్లాక్ 2026 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుందని, 100 పడకల ఏరియా వైద్యశాల రూ.57 కోట్లతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఆర్థో – ట్రామా బ్లాక్ రూ.10 కోట్లతో ప్రారంభమైందన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గహ నిర్మాణ సంస్థ ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) 2.0 క్రింద ఈ జిల్లాలో 4,307 ఇళ్లు లేని కుటుంబాలను గుర్తించి, వాటిలో 1,898 ఇళ్లు మంజూరు చేసి, ప్రతి ఇంటికి రూ.2.50 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు.
జిల్లా గ్రామీణాభివద్ది సంస్థ ద్వారా జాతీయ సరస్ మేళా ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు జాతీయ స్థాయి మార్కెట్ లభించి సుమారుగా రూ.25 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో గుంటూరు జిల్లాలో ఉపాధి శ్రామికులకు 20 లక్షల పని దినాల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 17.61 లక్షల పనిదినాలు కల్పించడం జరిగిందన్నారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా రూ.194.98 కోట్ల అంచనా విలువతో 265.54 కి.మీ తారు రోడ్లు మరియు 3 బ్రిడ్జీల నిర్మాణానికి 87 పనులు మంజూరు చేయగా, వాటిలో 16 పనులు పూర్తి చేయగా, 21 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుత జనాభాకు అవసరమైన 72 ఎంఎల్డీ సమగ్ర త్రాగునీటి సరఫరా కోసం రూ.393.74 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర అభివద్ధి కార్యక్రమం చేపట్టామన్నారు.
జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటు ద్వారా రూ.702 కోట్లు పెట్టుబడి రావడం జరిగిందన్నారు. ప్రొహిబిషన్,ఎ క్సైజ్ శాఖ ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.1,234.73 కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.


















