
క్రేన్ సంస్థల అధినేత గ్రంధి కాంతారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. సంపత్నగర్లో జరిగిన ఆయన జన్మదిన వేడుకలకు పార్టీ నేతలు, కార్పొరేటర్లతో హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ ఇటు వ్యాపార కార్యకలాపాలతో పాటు అటు ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలతో సదా సన్మార్గంలో నడిచే గొప్ప వ్యక్తి గ్రంధి కాంతారావు అని కొనియాడారు. ఆయన అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు. తండ్రి గ్రంధి సుబ్బారావు నుంచి స్వతహాగా అలవరుచుకున్న ఒక క్రమబద్ధమైన జీవనంతో అంచెలంచెలుగా ఎదిగి ఆజాత శత్రువులా మారారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు మందపాటి శేషగిరిరావు, గీతా మందిరం ఛైర్మన్ వెలుగూరి అభయశ్రీ రత్నప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు టీఎల్వీ ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ బత్తుల దేవానంద్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, పరసా కష్ణారావు, విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఆలా కిరణ్, రమణ తదితరులు పాల్గొని కాంతారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.