
గుంటూరు (23-01-2026 శుక్రవారం) :- స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా శుక్రవారం గుంటూరు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరంలో అమరత్వం సాధించిన మహానాయకుడు అని, ఆయన ధైర్యం, త్యాగం, దేశభక్తి యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తి ఇస్తాయని జిల్లా కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ శైలజ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి, ఆర్టీసీ ఆర్ ఎం డి సాంబ్రాజ్యం, ఆర్టీవో శ్రీహరి , కలెక్టరేట్ కార్యాలయం అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు