
వీడియో కాన్ఫెరెన్స్లో జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా, కమిషనర్ మయూర్ అశోక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వపరంగా వివిధ ముఖ్య కూడళ్ళు, ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 14వేల సీసీటీవీ కెమెరాలన్నీ సక్రమంగా పనిచేసే విధంగా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. సీసీటీవీ ప్రాజెక్టు, డాక్యుమెంట్ అప్లోడ్ ఫర్ ఏజెంట్ స్పేస్, పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్ అంశాలపై ఏపీ సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను కాపాడేందుకు ముఖ్యంగా నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, ట్రాఫిక్ ఉల్లంఘనలు తదితర వాటిని అదుపు చేసేందుకు చేసేందుకు సీసీటీవీ కెమెరాలను రియల్ టైం గవర్నెస్ కేంద్రంతో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి పి.మురళీధర్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పార్థసారథి, ఎం.టి.ఎం.సి అదనపు కమిషనర్ హేమ మాలిని తదితరులు పాల్గొన్నారు.