gunturnews.in

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

– 30 ఏళ్ల తరువాత ఎగ్జిబిషన్‌ ఏర్పాటు
– మెడికల్‌ ఎగ్జిబిషన్‌లో 40 స్టాల్స్‌ ఏర్పాటు
– మానవ శరీర అవయవాలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు
– ఆపరేషన్లు సైతం నేరుగా చూడవచ్చు

మీ పిల్లలు డాక్టర్లు కావాలని మీరు కోరుకుంటున్నారా.. అయితే వారిని మెడికల్‌ ఎగ్జిబిషన్‌కు తీసుకురండి. మీరు వైద్య వత్తి గురించి చెప్పేదానికంటే నేరుగా మీ పిల్లలు చూస్తే వారికే వత్తిపట్ల ఆసక్తివస్తుంది. గర్భిణీ ఒక బిడ్డకు జన్మనిచ్చేందుకు ఎంత కష్ట పడుతుందో…. సదరు బిడ్డను భూమిపైకి తెచ్చి ఊపిరి పోసేందుకు వైద్యులు ఎంత కష్టపడతారో కళ్లకు కట్టినట్లు మీరు నేరుగా చూడాలకుంటన్నారా…. అయితే గుంటూరు వైద్య కళాశాలకు రండి. గుప్పెడంత గుండె ఏ రంగులో ఉంటుంది…. లబ్‌డబ్‌ మంటూ ఎలా కొట్టుకుంటుంది… గుండెకు ఏలా చికిత్స అందిస్తారు అనే విషయాలను నేరుగా చూడాలనుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గుంటూరు వైద్య కళాశాలకు రండి. ఆపరేషన్‌ థియేటర్‌లో మత్తు ఎలా ఇస్తారు…. రోగికి నొప్పి లేకుండా వైద్యులు ఆపరేషన్‌ ఎలా చేస్తారనే ఆసక్తి కరవిషయాలను నేరుగా కళ్లతో చూడాలనుకుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గుంటూరు వైద్య కళాశాలకు రండి. ఆస్పత్రుల్లో ఉండే మర్మమైన, ఎన్నో గమ్మతైన విషయాలు, ఎప్పుడు కళ్లతో నేరుగా చూడలేని చికిత్సలు చూసే అత్యంత అద్భుతమైన అవకాశం నేడు అందరికి వచ్చింది. అది గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన మెడికల్‌ ఎగ్జిబిషన్‌ ద్వారా ప్రతి ఒక్కరు వైద్య చికిత్సల్లో జరిగే ఆసక్తికరమైన విషయాలను ప్రత్యక్షంగా చూసి సంతోషపడొచ్చు.
పిల్లలకు వైద్య రంగం గురించి, వైద్యవత్తిపై వైద్య వత్తిపై అవగాహన కల్పించేందుకు గుంటూరు వైద్య కళాశాలలో ఈనెల 4న మెడ్‌ఫ్యూజన్‌ పేరుతో మెడికల్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ముఖ్య అతిధిగా విచ్చేసి ఎగ్జిబిషన్‌ ప్రారంభిస్తారు. మూడు వారాలపాటు ఎగ్జిబిషన్‌ కొనసాగనుంది.

ఎగ్జిబిషన్‌ ప్రత్యేకతలు…
గుంటూరు వైద్య కళాశాలలో 30 ఏళ్ల క్రితం మెడికల్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. మరలా నేడు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగార్జున కొండ వెంకటసుందరాచారీ ఆధ్వర్యంలో బుధవారం ఎగ్జిబిషన్‌ ప్రారంభం కానుంది. ఎగ్జిబిషన్‌లో 40 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాల కాలేజ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఫండ్‌ను రూ. కోటిన్నర మేర ఎగ్జిబిషన్‌ కోసం ఖర్చు చేస్తున్నారు. ఒక్కో వైద్య విభాగం ఆధ్వర్యంలో వారు అందించే చికిత్సలు నేరుగా చూసి సందేహాలు సైతం నివత్తి చేసుకోవచ్చు. ఆపరేషన్లపై ఉండే భయాలు తొలగించుకోవచ్చు. ప్రస్తుతం ఎగ్జిబిషన్‌ వీక్షించేందుకు 2,500 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. సుమారు లక్షన్నరమంది వీక్షిస్తారని నిర్వహాకులు అభిప్రాయడుతున్నారు.

శరీరభాగాలు నేరుగా చూడొచ్చు….
మన గుండె ఎలా ఉంటుందో మనకు తెలియదు. మెడికల్‌ ఎగ్జిబిషన్‌లో నేరుగా గుండె, లివర్, కిడ్నీ, బ్రెయిన్‌ ఇలా కంటికి కనిపించకుండా మనిషిలో ఉండే ప్రతి అవయవాన్ని మనం చూసి ఆనందపడొచ్చు. శరీరం లేకుండా ఉండే అస్థిపంజరం చూడొచ్చు. చనిపోయాక మానవ శరీరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు. వ్యాధులు శరీరానికి ఏ విధంగా సోకుతాయి, వ్యాధులు సోకితే అవయవాలు ఏ విధంగా పాడవుతాయి, వ్యాధులను ఏ విధంగా గుర్తిస్తారు, వ్యాధులకు ఎలా చికిత్సలు, ఆపరేషన్లు చేస్తారు, మందులు ఏ విధంగా పనిచే స్తాయి ఇలా వైద్య రంగానికి , ఆస్పత్రుల్లో జరిగే చికిత్సల విషయాలన్నీ నేరుగా చూసి కూలంకుషంగా తెలుసుకుని సందేహాలు పూర్తిగా నివత్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా మెడికల్‌ రంగంపై, వైద్య వత్తిపై కూడా మక్కువ పెంచుకునేలా ఎగ్జిబిషన్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రతి ఒక్కరు సందర్శించి తెలుసుకోండి….
డాక్టర్‌ నాగార్జునకొండ వెంకటసుందరాచారి, ప్రిన్సిపాల్, గుంటూరు వైద్యకళాశాల, గుంటూరు.
గుంటూరు వైద్య కళాశాలలో ఈనెల 4న ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ ఎగ్జిబిషన్‌ను ప్రతి క్కరు సందర్శించి వైద్య రంగం గురించి తెలుసుకోండి. మనిషిని సజీవంగా జీవింప చేసేలా వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య రంగం ఏ విధంగా పనిచేస్తారో, ఎంత కష్టపడతారో, వైద్య రంగం ఏంత మేరకు అభివద్ధి చెందిందో అంతా కూడా మెడికల్‌ ఎగ్జిబిషన్‌ ద్వారా అవగాహన వస్తుంది. సుమారు 30 ఏళ్ల తరువాత ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ ఎగ్జిబిషన్‌ ముఖ్య ఉద్ధేశ్యం ప్రతి ఒక్కరికి వైద్య రంగంపై అవగాహన కల్పించటమే. గతంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ ఎగ్జిబిషన్‌ల ద్వారా ఎంతో మంది ప్రేరణ పొంది వైద్య రంగంలోకి వచ్చి ఎంతో మంది ప్రాణాలు రక్షిస్తున్నారు. స్కూల్, కాలేజ్‌ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా మెడికల్‌ ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తే మంచి అనుభూతి పొందుతారు.

Exit mobile version