gunturnews.in

ప్రజా సమస్యల పోరాటాలపై ప్రశంసలు

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ నేడు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పలు ప్రజా సమస్యలు, వాటిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటాలు, ఉద్యమాల తీరుపై విస్తృతంగా చర్చ జరిగింది.
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ నిరంతరం పోరాటం సాగిస్తోందని గులాం రసూల్ ఈ సందర్భంగా వివరించారు. ప్రజా హక్కుల పరిరక్షణలో వైసీపీ అనుసరిస్తున్న విధానాన్ని, పార్టీ శ్రేణులు చేస్తున్న కృషిని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆసక్తిగా విన్నారు.
అనంతరం ప్రజా సమస్యలపై వైసీపీ చేపడుతున్న ఉద్యమాలు, పోరాటాలను గులాం రసూల్ గారు ప్రశంసించారు. ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యల కోసం నిరంతరం పోరాడటమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ భేటీతో పార్టీ నాయకత్వం, కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొనగా, రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత బలమైన ఉద్యమాలు చేపట్టేందుకు దిశానిర్దేశం లభించిందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Exit mobile version