రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆమె కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించిన రోజు గణతంత్ర దినోత్సవమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతత్వంలో రూపొందిన రాజ్యాంగం మన దేశానికి దిశానిర్దేశం చేసిందన్నారు. దేశ స్వాతంత్య్రాన్ని సాధించిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ, రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత మనందరిదని గుర్తించాలన్నారు. ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తితో ముందుకు సాగితేనే భారతదేశం మరింత గొప్పగా ఎదుగుతుందన్నారు.
