gunturnews.in

కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు


పట్టు వస్త్రాలతో ఎమ్మెల్యే నసీర్‌అహ్మాద్‌

స్థానిక ఆర్‌.అగ్రహారం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆత్మార్పణ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచి అమ్మవారి మూలవిరాట్‌కి పంచామతాభిషేకం చేపట్టారు. అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు చేపట్టగా, 108 మంది కన్యలతో ఊరేగింపు కొనసాగింది. అనంతరం గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ నజీర్‌ సమర్పించారు. దేవస్థాన ప్రాంగణంలో ఆధునికరించిన కార్యాలయపు గదిని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో 35 డివిజన్‌ కార్పొరేటర్‌ ఈరంటి వరప్రసాద్, ఆర్యవైశ్య మహాసభ ఈసీ సభ్యులు కొనకళ్ళ సత్యం, ఆలయ ఈవో నిడుమానూరు శ్రీనివాసులు, ఉత్సవ కమిటి చైర్మన్‌ కోటా శేషగిరిరావు, కమిటి కన్వీనర్లు, సలహాదారులు, సభ్యులు, గీత మందిరం చైర్మన్‌ జుజ్జురి శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ టంగుటూరి అర్జునరావు పాల్గొన్నారు. తొలుత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.

Exit mobile version